15 రోజుల క్రితం మొబైల్ మిస్ (సి ఈ ఐ ఆర్) పోర్టల్ ద్వారా మొబైల్ రికవరీ

15 రోజుల క్రితం మొబైల్ మిస్
(సి ఈ ఐ ఆర్) పోర్టల్ ద్వారా మొబైల్ రికవరీ

జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ మహేందర్.

తెలంగాణ కెరటం ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి డిసెంబర్

ఈ సందర్భంగా మెదక్ జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ శమహేందర్ మాట్లాడుతూ
అక్బర్ అలీ అనే వ్యక్తి మెదక్ పట్టణంలోని కూరగాయల మార్కెట్ లో 15 రోజుల క్రితం ఫోన్ పోగొట్టుకొని పోలీస్ స్టేషన్ కు వచ్చి దరఖాస్తు ఇవ్వగా ఫోన్ నెంబర్ ను మరియు ఐ ఎం ఈ ఐ నంబర్ ను సి ఈ ఐ ఆర్ పోర్టల్ నందు అప్లోడ్ చేయడం జరిగింది. శనివారం ఫోను దొరికిన అతని వద్ద నుండి రికవరీ చేసి సంబంధిత బాధితునికి అప్పగించడం జరిగింది.
ఎవరైనా ఫోన్ పోగొట్టుకుంటే, లేదా గుర్తుతెలియని వ్యక్తులు దొంగతనంగా ఎత్తుకొని పోయిన వారు వెంటనే కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన సి ఈ ఐ ఆర్(సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్) పూర్తి వివరాలు నమోదు చేసి పోగొట్టుకున్న ఫోన్ ను నేరుగా బ్లాక్ చేయవచ్చని,తద్వారా కోల్పోయిన ఫోన్ను తిరిగి పొందే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు.ఈ పోర్టల్ ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎవరన్నా సెకండ్ హ్యాండ్ ఫోన్స్ అమ్మితే కొనవద్దని సూచించారు. ఈ ఫోన్ కనుగొనుటకు కష్టపడిన హెడ్ కానిస్టేబుల్ ఎండి లాయక్ అలీని కానిస్టేబుల్ మహేందర్ గౌడ్ ని ఈ సందర్భంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో డి సి ఆర్ బి ఇన్స్పెక్టర్ మధు సూదన్ గౌడ్ పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Latest Stories

*శ్రీ కృష్ణ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా ముగ్గుల పోటీలు* తెలంగాణ కెరటం యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి (జనవరి 15): *యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం వడాయిగూడెం గ్రామంలో శ్రీ కృష్ణ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యూత్ సభ్యులైన కీర్తిశేషులు ముద్దసాని చందు గౌడ్ రాసాల మల్లేష్ యాదవ్ ఏర్పుల ఎల్లస్వామి యాదవ్ వట్టిపల్లి వెంకటేష్ గౌడ్ గార్ల జ్ఞాపకార్ధంగా వీరి పవిత్రమైన ఆత్మ శాంతిని చేకూరాలని మౌనం పాటించి మహిళలకు ముగ్గుల పోటీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో 128 మంది మహిళలు పోటీలో పాల్గొన్నారు ఇందులో 11 ఉత్తమ ముగ్గులకు బహుమతితోపాటు పాల్గొన్న ప్రతి ఒక్క మహిళకు కన్సోలేషన్ బహుమతి అందజేశారు . మొదటి పబ్బాల ఉమారాణి,ద్వితీయ బబ్బురి మమత,తృతీయ బండారి పద్మ, 4వ ఏషబోయిన అక్షర,5వ ముద్దం మానస,6వ శెట్టి మహాలక్ష్మి,7వ కోట స్వాతి,8వ శెట్టి కావ్య,9వ సుక్కల సహస్ర,10వ తోటకూరి హంసాలు,11వ ప్రబ్బాల ప్రసన్న బహమతులు గెలుపొందారు.ఈ సందర్భంగా శ్రీకృష్ణ యూత్ అధ్యక్షులు జిట్ట నరేష్ యాదవ్,గౌరవ అధ్యక్షులు శ్రీ కృష్ణ యాదవ సంఘం భువనగిరి మండల అధ్యక్షులు చుక్కల శంకర్ యాదవ్ మరియు భువనగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ కనకుంట్ల రేఖ బాబురావు మాట్లాడుతూ గ్రామంలో పండగల సందర్భంగా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను గ్రామంలోని మహిళలందరూ పాటిస్తూ ముగ్గుల పోటీలలో చురుకుగా పాల్గొని అద్భుతంగా ముగ్గులు వేసిన మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో చీర్క సురేష్ రెడ్డి,నీల ఓం ప్రకాష్ గౌడ్,నాగ వినోద్,మాణిక్యం రెడ్డి,మంగు నరసింహ,కోట పెద్ద స్వామి,శ్రీ దుర్గాదేవి,బబ్బురి శంకర్ గౌడ్,శెట్టి సుమన్ యాదవ్ ,శెట్టి వంశీ యాదవ్ ,బండారు స్వామి,సుక్కల శ్రీశైలం యాదవ్ ,నోముల నరసింహ యాదవ్,నోముల శ్రీశైలం, శెట్టి శ్రవణ్ యాదవ్ ,గొట్టేటి యాదగిరి, తోటకూరి వెంకటేశ్ యాదవ్ ,మాజీ అధ్యక్షులు రసాల రాజు యాదవ్ ,వల్లాల రాజు ,మాటూరి ఉపేందర్ ,శెట్టి అశోక్ ,శెట్టి శంకర్, గొట్టేటి వెంకటేష్,గొట్టేటి తిరుపతి ,చుక్కల రామకృష్ణ, కలకుంట్ల స్వామి ,శెట్టి మహిపాల్ ,పాక లక్ష్మణ్ ,శ్రీకృష్ణ యూత్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment