యువ జర్నలిస్ట్ ముఖేష్ చంద్రకర్ హత్య పిరికిపంద చర్య.
టీయూడబ్ల్యూజే ( హెచ్-143) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చందునాయక్.
తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (జనవరి 5):
చత్తీస్ ఘడ్ రాష్ట్రం బీజాపూర్ కు చెందిన యువ జర్నలిస్ట్, అంకితభావం కలిగిన ముఖేష్ చంద్రకర్ ను అవినీతి అక్రమాలు బయట పెట్టిన కారణంగా హత్య చేయడం పిరికిపంద చర్య అని టీయూడబ్ల్యూజే ( హెచ్-143) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చందునాయక్ ఆదివారం ఒక ప్రకటనలో హత్యను తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హత్య చాలా బాధాకరమని, ముఖేష్ నిష్క్రమణ జర్నలిజం వర్గాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని, ఇలాంటి జర్నలిస్టులు హత్యా గావించడం సమాజానికి తీరని లోటని పేర్కొన్నారు. ఈ హత్య హేయమైనదని, పిరికిపంద చర్య అని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖేష్ నడిపే “బస్తర్ జంక్షన్” అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా బస్తర్ ప్రాంతంలోని సమస్యలను వెలికి తీసే క్రమంలో జరుగుతున్న అవినీతిపై అనేక కథనాలను వెలుగులోకి తేవడంతో.. అవినీతిపరులైన కాంట్రాక్టర్లు ముఖేష్ ను గొడ్డలితో నరికి, సెప్టిక్ ట్యాంక్ లో డెడ్ బాడీని పడేశారని, ప్రజాస్వామిక దేశంలో ఇలాంటి హత్యలను తీవ్రంగా ఖండించాలని కోరారు. జర్నలిస్టులకు ప్రభుత్వాలు రక్షణ కల్పించాలని, ఈ దుర్ఘటనకు పాల్పడిన నిందితులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని కేంద్ర ప్రభుత్వం, ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
.