జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ హనుమంత రావు.

జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ హనుమంత రావు.

 

తెలంగాణ కెరటం యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి (డిసెంబర్ 28):

 

శనివారం రోజు భువనగిరి పట్టణంలోని జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి,సిబ్బంది యొక్క అటెండెన్స్ రిజిస్టర్ పరిశీలించి, ఎంతమంది సిబ్బంది విధులకు హాజరయ్యారని,ఎంత మంది సిబ్బంది ఆబ్సెంట్ అయ్యారని ఆరా తీశారు.అత్యవసర విభాగం సిబ్బంది అందరూ అందుబాటులో ఉండాలన్నారు. ఓ. పి రిజిస్టర్ ను పరిశీలించి , ఈరోజు ఎంతమంది పేషెంట్లు ఆస్పత్రికి వచ్చారని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. మందుల స్టాక్ గురించి అడిగి తెలుసుకున్నారు.మందుల కొరత లేకుండా చూడాలని, అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలన్నారు . ఆసుపత్రిలో వైద్యులు,సిబ్బంది సమయపాలన పాటించాలని, లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆసుపత్రిలో వార్డును పరిశీలించి చికిత్స పొందుతున్న పేషంట్లతో కలెక్టర్ మాట్లాడుతూ వారికి అందుతున్న వైద్యం గురించి పేషెంట్ లను అడిగి తెలుసుకున్నారు.రోగులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మెరుగైన సేవలు అందించాలని ఆసుపత్రి నిర్వహణ మెరుగ్గా ఉండాలన్నారు. ప్రజలకు ప్రభుత్వ ఆస్పత్రిలో కూడా మెరుగైన వైద్యం అందుతుందని, పేషెంట్లు ప్రైవేట్ హాస్పటల్ కు వెళ్లి డబ్బులను వృధా చేసుకోవద్దని సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్, రాజారామ్, చిన్నా నాయక్, వైద్య అధికారులు అనిల్ కుమార్, కిరణ్, కరణ్ రెడ్డి,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment