అతి వేగంతో దూసుకొచ్చి పల్టీలు కొట్టిన కారు.
కారు బీభత్సవంలో ఒకరి మృతి
తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి జనవరి
నాగర్ కర్నూల్ మండలం పెద్ద ముద్దునూరు వద్ద అతివేగంగా దూసుకొచ్చిన గాలిలో పల్టీలు కొడుతూ బీభత్సం సృష్టించి ఒకరిని బలితీసుకుంది.కారు సృష్టించిన బీభత్సానికి లక్ష్మమ్మ(40)అనే మహిళ మృతిచెంద గా డ్రైవర్ తీవ్రంగాగాయపడ్డాడు.సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.నాగర్ కర్నూల్ నుండి కొల్లాపూర్ వైపు బుధవారం వెళుతున్న అతివేగంగా వెళుతున్న కారు ప్రమాదవశాత్తు అదుపుతప్పింది. అతివేగంగా ఉండడంతో కారు రోడ్డుపై నుండి పల్టీలు కొడుతూ పక్కనే నడుచుకుంటూ వెళుతున్న భోగరాజు లక్ష్మమ్మ అనే మహిళ పైనుండి వెళ్ళింది.ఈ సంఘటనలో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.గాయపడ్డ కారు డ్రైవర్ ను అంబులెన్స్ లో చికిత్స నిమిత్తం నాగర్ కర్నూల్ ఏరియా హాస్పిటల్ కు తరలించారు. ప్రమాద సంఘటనపై మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.