మోహన్ బాబుపై హత్యా యత్నం కేసు నమోదు చేయాలి.

మోహన్ బాబుపై హత్యా యత్నం కేసు నమోదు చేయాలి.

 

టీయూడబ్ల్యూజె జిల్లా అధ్యక్షులు శంకర్ దయాళ్ చారి డిమాండ్.

 

మెదక్ కలెక్టరేట్ ముందు నిరసన.

 

తెలంగాణ కెరటం

ఉమ్మడి మెదక్ జిల్లా

ప్రధాన ప్రతినిధి డిసెంబర్ 11:

 

కవరేజ్ కు వెళ్లిన ఈటీవీ, టీవీ9, టీవీ5 టీవీ ఛానళ్ల ప్రతినిధులపై దాడికి పాల్పడిన సీనియర్ సినీ నటుడు మంచు మోహన్ బాబుపై హత్యా యత్నం కేసు నమోదు చేసి తక్షణమే అరెస్ట్ చేయాలని టీయూడబ్ల్యూజే (ఐజెయూ) జిల్లా అధ్యక్షుడు శంకర్ దయాళ్ చారి డిమాండ్ డిమాండ్ చేశారు. బుధవారం మెదక్ కలెక్టరేట్ ముందు నిరసన తెలిపారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ నగేష్ కు వినతిపత్రం అందజేశారు.శంకర్ దయాళ్ చారి మాట్లాడుతూ మోహన్ బాబు విలనిజం జర్నలిస్తులపై నడవదన్నారు.గతంలో సినిమా నటి సాక్షి శివానంద్, సీనియర్ నటి జయంతిలపై మోహన్ బాబు చేసిన దాడులు, పెట్టిన హింసలు ఇప్పటికి అనేక మందికి గుర్తు వున్నాయన్నారు. ఒక సినిమా నటుడుగా, నిర్మాతగా,డైరెక్టర్ గా,పార్ట్ టైం రాజకీయ వేత్తగా,విద్యా సంస్థల నిర్వాహకుడిగా,రియల్ ఎస్టేట్ ఓనర్ గా ఎన్ని పాత్రలు వేసినా తన క్రిమినల్ బుద్ధిని మోహన్ బాబు ఏనాడు వదిలి పెట్ట లేదని ద్వజమెత్తారు.నిజాలను భరించే శక్తిలేక టీ.వీ.9 ప్రతినిధిపై నటుడు మోహన్ బాబు వీరావేశంగా దాడి చేయడం అర్థంఅవుతుందన్నారు. మోహన్ బాబుపై హత్యా యత్నం కేసు నమోదు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన తప్పదని హెచ్చరించారు.ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సంతోష్ కుమార్,జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు నాగరాజు,ఐజెయూ మాజీ సభ్యుడు ఫరూక్ హుస్సేన్, నాయకులు మురళీధర్ గుప్తా, శ్రీధర్, శ్రీనివాస్, గోవర్ధన్ రెడ్డి, అల్లాడి శేఖర్, శ్రీనివాస్, ఆంజనేయులు,కృష్ణమూర్తి, హమీద్,శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment