మల్టీ పర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ కోసం అసైన్డ్ భూముల రైతులతో చర్చ నిర్వహించిన 

మల్టీ పర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ కోసం అసైన్డ్ భూముల రైతులతో చర్చ నిర్వహించిన 

జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్

 

తెలంగాణ కెరటం వికారాబాద్ జిల్లా క్రైమ్ ప్రతినిధి (జనవరి 18)

మల్టీ పర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ కోసం అసైన్డ్ భూములకు సంబంధించి దుద్యాల మండలం పోలేపల్లి గ్రామ రైతులతో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ చర్చలు నిర్వహించారు.ఫారమ్-సి నోటిఫికేషన్ 29 నవంబర్, 2024న 60 రోజుల పాటు అంటే 27-01-2025 వరకు సమ్మతి అవార్డు కోసం జారీ చేయబడిందన్నారు. పేర్కొన్న వ్యవధిలో భూసేకరణలో ఏవైనా అభ్యంతరాలు తదితర అంశాలపై సమావేశంలో కూలంకుశంగా చర్చించడం జరిగింది. ఈ రోజు మొత్తం 34 మంది రైతులు హాజరయ్యారు. దుద్యాల్ మండలం పోలేపల్లి గ్రామంలో మొత్తం 73.39 ఎకరాల భూమి ఉందని దీనిపై రైతులతో చర్చ నిర్వహించి రైతుల సమ్మతాన్ని పొందినట్లు కలెక్టర్ తెలిపారు. సమ్మతి అవార్డు పొందిన రైతులకు  ఎకరానికి 20 లక్షలు, 150 గజాల ఇంటి స్థలములో ఇందిరమ్మ ఇల్లు, ఇంటికి ఒక ఉద్యోగం కల్పించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ లింగ్యా నాయక్ , తాండూరు సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్, అసిస్టెంట్ కలెక్టర్ ట్రైనీ ఉమా హారతి , టిజిఐసి జోనల్ మేనేజర్ శైలజ, అసిస్టెంట్ జోనల్ మేనేజర్ అజీమ సుల్తానా, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడి రామ్ రెడ్డి , ఆర్ అండ్ బి ఇఇ శ్రీధర్ రెడ్డి, దుద్యాల తహసిల్దార్ కిషన్ పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment