సిఎ లో విజయం సాధించిన విద్యార్థికి సన్మానం

సిఎ లో విజయం సాధించిన విద్యార్థికి సన్మానం

తెలంగాణ కెరటం, మందమర్రి డిసెంబర్

మందమర్రి నార్లాపూర్ కి చెందిన బుడిగె సమ్మయ్య, రాజేశ్వరి కుమారుడు శివ కుమార్ చార్టెడ్ అకౌంట్స్ లో ఘనవిజయం సాధించడంతో కురుమ సంఘం మంచిర్యాల జిల్లా అద్యక్షురాలు బండి రమశంకర్ ఆధ్వర్యం లో గ్రామస్తులతో కలిసి సోమవారం విద్యార్థిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పేద కుటుంబానికి చెందిన శివ కుమార్ చిన్ననాటి నుండి చదువులో రానిస్తూ ఉన్నంతంగా ఎదగడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. సన్మానించిన వారిలో షేగొండ శంకరయ్య, ఏనుగుల బీరయ్య, పోషన్న, సుధాకర్, సత్యనారాయణ, సాగర్, మల్లన్న, ఒగ్గు మల్లయ్య,గోపాల్, తిరుపతి, రమేష్, సురేష్ గట్టయ్య తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment