రోడ్డు భద్రతపై వాహనదారులకు అవగాహన
మర్కుక్ మండల ఎస్ఐ ఓ.దామోదర్
తెలంగాణ కెరటం గజ్వేల్ డివిజన్ నియోజకవర్గ ప్రతినిధి
జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా గురువారం నాడు మర్కుక్ మండల ఎస్ఐ దామోదర్ సిబ్బందితో కలిసి మర్కుక్ మండల కేంద్రంలో వాహనదారులకు,యువకులకు ప్రజలకు ట్రాఫిక్ నిబంధనలు రోడ్డు నిబంధనల గురించి అవగాహన కల్పించారు.ప్రతి వాహనదారుడు నిబంధనలను పాటించాలని సూచించారు.త్రిబుల్ రైడింగ్ చేయవద్దని,మైనర్ డ్రైవింగ్ ప్రమాదకరమని,వాహనం నడిపేటప్పుడు వాహనంకు సంబంధించిన పత్రాలు,డ్రైవింగ్ లైసెన్,ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని అవగాహన కల్పించారు.