ఒక్క రాయితో.. అపర కోటీశ్వరుడు.

ఒక్క రాయితో.. అపర కోటీశ్వరుడు.

ఎలాగో తెలిస్తే దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే

తెలంగాణ కెరటం స్టేట్ బ్యూరో ప్రతినిధి డిసెంబర్

జీవితంలో కొన్నిసార్లు ఊహించని, ఆశ్చర్యకరమైన ఘటనలు చోటుచేసుకుంటుంటాయి. అలా జరుగుతుందని ఎప్పుడూ ఊహించలేం. ఉదాహరణకు ఓ నిరుపేద రాత్రికి రాత్రి లాటరీ తగిలి కోటీశ్వరుడు కావడం వంటి ఎన్నో ఘటనలు చూస్తున్నాం. ఇలాంటి ఘటనే ఒకటి ఆస్ట్రేలియాకు చెందిన ఓ వ్యక్తి విషయంలో జరిగింది. ఇంతకీ ఏం జరిగిందనుకుంటున్నారా.. ఓ రాయిలో బంగారం ఉంటుందని అతగాడు ఎంతో కష్టపడి దానిని పగలగొట్టేందుకు ప్రయత్నించాడు. చివరకు చేతకాక పరిశోధకుల దగ్గరకు తీసుకెళ్లి చూపిస్తే బంగారం లేదు కానీ.. అంతకుమించే సాధించానని తెలియడంతో ఆ వ్యక్తి ఆనందానికి అవధుల్లేవు. ప్రపంచంలో కోట్లలో ఒక్కరికే మాత్రమే కనిపించే రాయిని కనుగొని బంపర్ ఆఫర్ అందుకున్నాడు. బంగారం కంటే వందల రెట్ల విలువైన రాయితో రాత్రికి రాత్రే వందల కోట్లకు అధిపతి అయిపోయాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఇతగాడి గురించే చర్చ. ఇంతకీ ఏం జరిగిదంటే..

ఆస్ట్రేలియాకు చెందిన డేవిడ్ హోల్‌కు విలువైన రత్నాలు, అరుదైన రాళ్లను సేకరించడం హాబీ. అందుకోసం ఎంతదూరమైనా వెళ్లేందుకు వెనుకాడడు. అలా 2015లో పార్క్‌లో వెళుతుండగా ఎర్రటి రంగుగల ఓ బరువైన రాయిని కనుగొన్నాడు. దాని లోపల బంగారం ఉంటుందనే ఉద్దేశంతో రాయిని పగలగొట్టేందుకు ఏళ్ల తరబడి శతవిధాలా ప్రయత్నించాడు. బరువైన సుత్తి, యాసిడ్ సహా ఎన్ని సాధనాలు వాడినా రాయిలో కాస్త కూడా పగుళ్లు రాలేదు. ఏళ్ల తరబడి విఫల ప్రయత్నాలు చేశాక చివరికి ఆ రాయిని మెల్‌బోర్న్ మ్యూజియమ్‌కి తీసుకెళ్లి చూపించాడు. అక్కడ ఆ రాయిని పరిశోధించిన పురాతత్వ శాస్త్రవేత్తలు డేవిడ్ హోల్ బంగారం కంటే వేల రెట్లు విలువైందని గుర్తించారు. ప్రపంచంలో అత్యంత అరుదైన ఈ రాయి విలువ వేల మిలియన్ డాలర్లుగా అంచనా వేస్తున్నారు నిపుణులు.

డేవిడ్ హోల్‌ కనిపెట్టిన అరుదైన రాయి ఒక ఉల్క. దాని పేరు మేరీబోరో. 17 కిలోల బరువున్న ఈ రాయి 4.6 బిలియన్ సంవత్సరాలు క్రితం నాటిది. నికెల్, ఐరన్ మూలకాల మిశ్రమైన ఈ రాయి అంగారకుడు(మార్స్), బృహస్పతి(జూపిటర్) మధ్య ఉన్న ఉల్క బెల్ట్ ద్వారా 100 నుంచి 1000 సంవత్సరాల మధ్య భూమికి చేరి ఉంటుందని మెల్‌బోర్న్ పరిశోధకులు విశ్లేషిస్తున్నారు.

ఈ ఉల్క ద్వారా సౌరవ్యవస్థలో అంతుచిక్కని రహస్యాలను అధ్యయనం చేయవచ్చు. డేవిడ్ హోల్ ఆవిష్కరణ ఓ నిజమైన సంపద అని, దీని విలువ ట్రిలియన్ డాలర్లు అయినా ఉండవచ్చని లెక్కగడుతున్నారు. ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రంలో ఈ ఉల్కతో సహా ఇప్పటివరకూ 17 అరుదైన ఉల్కలను గుర్తించారు పరిశోధకులు..

Join WhatsApp

Join Now

Latest Stories

*శ్రీ కృష్ణ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా ముగ్గుల పోటీలు* తెలంగాణ కెరటం యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి (జనవరి 15): *యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం వడాయిగూడెం గ్రామంలో శ్రీ కృష్ణ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యూత్ సభ్యులైన కీర్తిశేషులు ముద్దసాని చందు గౌడ్ రాసాల మల్లేష్ యాదవ్ ఏర్పుల ఎల్లస్వామి యాదవ్ వట్టిపల్లి వెంకటేష్ గౌడ్ గార్ల జ్ఞాపకార్ధంగా వీరి పవిత్రమైన ఆత్మ శాంతిని చేకూరాలని మౌనం పాటించి మహిళలకు ముగ్గుల పోటీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో 128 మంది మహిళలు పోటీలో పాల్గొన్నారు ఇందులో 11 ఉత్తమ ముగ్గులకు బహుమతితోపాటు పాల్గొన్న ప్రతి ఒక్క మహిళకు కన్సోలేషన్ బహుమతి అందజేశారు . మొదటి పబ్బాల ఉమారాణి,ద్వితీయ బబ్బురి మమత,తృతీయ బండారి పద్మ, 4వ ఏషబోయిన అక్షర,5వ ముద్దం మానస,6వ శెట్టి మహాలక్ష్మి,7వ కోట స్వాతి,8వ శెట్టి కావ్య,9వ సుక్కల సహస్ర,10వ తోటకూరి హంసాలు,11వ ప్రబ్బాల ప్రసన్న బహమతులు గెలుపొందారు.ఈ సందర్భంగా శ్రీకృష్ణ యూత్ అధ్యక్షులు జిట్ట నరేష్ యాదవ్,గౌరవ అధ్యక్షులు శ్రీ కృష్ణ యాదవ సంఘం భువనగిరి మండల అధ్యక్షులు చుక్కల శంకర్ యాదవ్ మరియు భువనగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ కనకుంట్ల రేఖ బాబురావు మాట్లాడుతూ గ్రామంలో పండగల సందర్భంగా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను గ్రామంలోని మహిళలందరూ పాటిస్తూ ముగ్గుల పోటీలలో చురుకుగా పాల్గొని అద్భుతంగా ముగ్గులు వేసిన మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో చీర్క సురేష్ రెడ్డి,నీల ఓం ప్రకాష్ గౌడ్,నాగ వినోద్,మాణిక్యం రెడ్డి,మంగు నరసింహ,కోట పెద్ద స్వామి,శ్రీ దుర్గాదేవి,బబ్బురి శంకర్ గౌడ్,శెట్టి సుమన్ యాదవ్ ,శెట్టి వంశీ యాదవ్ ,బండారు స్వామి,సుక్కల శ్రీశైలం యాదవ్ ,నోముల నరసింహ యాదవ్,నోముల శ్రీశైలం, శెట్టి శ్రవణ్ యాదవ్ ,గొట్టేటి యాదగిరి, తోటకూరి వెంకటేశ్ యాదవ్ ,మాజీ అధ్యక్షులు రసాల రాజు యాదవ్ ,వల్లాల రాజు ,మాటూరి ఉపేందర్ ,శెట్టి అశోక్ ,శెట్టి శంకర్, గొట్టేటి వెంకటేష్,గొట్టేటి తిరుపతి ,చుక్కల రామకృష్ణ, కలకుంట్ల స్వామి ,శెట్టి మహిపాల్ ,పాక లక్ష్మణ్ ,శ్రీకృష్ణ యూత్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment