రాజన్న కోడలపై స్థానిక ఎమ్మెల్యే స్పష్టత ఇవ్వండి.

రాజన్న కోడలపై స్థానిక ఎమ్మెల్యే స్పష్టత ఇవ్వండి.

డైవర్టు రాజకీయాలు మానుకొని అభివృద్ధికి స్వాగతం పలకండి…

వ్యక్తిగత విమర్శలు చేస్తే ఊరుకోబోము

కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది…

తెలంగాణ కెరటం రాజన్న సిరిసిల్ల జిల్లా డిసెంబర్:-

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అత్యంత ప్రీతికరమైన మొక్కు కోడెమొక్కు ఏటా కోడే మొక్కుతో కోట్ల రూపాయలలో రాజన్నకు ఆదాయం చేరుకుంటుంది కానీ ఆదాయం తీసుకువచ్చే కోడెకు మాత్రం రక్షణ కరువైంది

బుధవారం వేములవాడ పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో బిఆర్ఎస్ యువజన విభాగం నాయకులు వెంగళ శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ మంగళవారం రోజున కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ రాజన్న కోడెల విషయం పక్కనబెట్టి వ్యక్తిగత విషయాలు తీస్తూ డైవర్ట్ రాజకీయాలు చేస్తున్నారని, మంత్రి కొండా సురేఖ సిఫారసు చేసిన కోడెల పంపిణీ సక్రమమా.. అక్రమమా మీరే తేల్చి చెప్పండి? ఇప్పటివరకు స్థానిక ఎమ్మెల్యే కోడెల తరలింపు పై ఎలాంటి స్పష్టత ఇవ్వకపోగా మా నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మి నరసింహరావు పై వ్యక్తిగత విమర్శలు చేస్తూ కాలయాపన చేస్తున్నారని మంగళవారం రోజున రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి కోడెల మృతిపై శాంతి హోమం జరుపగా ఆ విషయాన్ని డైవర్ట్ చేయాలని కాంగ్రెస్ నాయకులు కుట్ర రాజకీయాలు చేస్తున్నారని .. అలాగే సీఎం సభలో భోజనాల పేరిట ప్లేటుకు 32వేల చొప్పున బిల్లులు వేసి రాజన్న ఈవో కి పంపిన విషయం నిజం కాదా? మూడో విడత కోడెల పంపిణీ జిల్లా కలెక్టర్ కు తెలియకుండా స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రారంభించారని దీనిపై కలెక్టర్ అధికారులపై రివ్యూ సమావేశం నిర్వహించి ఆగ్రహం వ్యక్తం చేసిన సంఘటన ప్రజలందరికీ తెలుసు తెలంగాణలోనే శైవ క్షేత్రంగా పేరుగాంచిన రాజన్న ఆలయాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు స్టార్ హోటల్ గా మార్చిన ఘనత మీకే దక్కిందన్నారు. మీరు చేసిన పాపాలు పోవాలంటే రాజన్న ఆలయ ధర్మగుండంలో నిండా మునిగి తడి బట్టలతో రాజన్న ముందు పొర్లుదండాలు పెట్టి మమ్మల్ని క్షమించు రాజన్న అని వేడుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులకు విన్నవించుకుంటున్నాం అనంతరం పోతూ అనిల్ కుమార్ మాట్లాడుతూ నిన్నటి రోజున కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఆనాడు ఏ పార్టీలో ఉన్నారో అప్పుడు రేవంత్ రెడ్డి మీద ఏం మాట్లాడారో మాకు తెలుసు ఒకసారి ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. ఇక్కడ ఉంటే ఈ పాట అక్కడ ఉంటే ఆ పాట పాడితే వ్యక్తిగతంగా మీరే ప్రజలకు దూరం అవుతారు అది గుర్తుంచుకోవాలని మేము తెలియజేస్తున్నామన్నారు.

ఈ సమావేశంలో సీనియర్ నాయకులు లిక్కిడి మహేందర్, వాసాల శ్రీనివాస్, సుంకపాక రాజు, ఎస్.కె పర్వేజ్, మంతే సందీప్, దురిశెట్టి ప్రేమ్ చారి, బూర రాజశేఖర్, ఎండి రఫిక్, వెంకట సాయి, తీగల హరీష్, చీటి సంధ్యారాణి, రాకేష్, తదితరులు ఉన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment