*అయ్యప్ప ఆశీస్సులతో.. అందరూ సుభిక్షంగా ఉండాలి*
*మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాపరెడ్డి*
*కొత్తూరు లో ఘనంగా అయ్యప్ప స్వామి పడిపూజ*
*హాజరైన మాజీ జెడ్పిటిసి మామిడి శ్యాంసుందర్ రెడ్డి*
*పాల్గొన్న మాజీ ఎంపీపీలు శివశంకర్ గౌడ్,పిన్నింటి మధుసూదన్ రెడ్డి*
*రిపోర్టర్ మధుసూదన్ గౌడ్ సోదరుడు వంశి గౌడ్ స్వామి ఆధ్వర్యంలో గురుస్వామి గిరీష్ నాయర్ సమక్షంలో పడిపూజ*
కొత్తూరు డిసెంబర్ 17 (తెలంగాణ కెరటం)
అయ్యప్పస్వామి ఆశీస్సులతో అందరూ సుభిక్షంగా ఉండాలని మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాపరెడ్డి అన్నారు.
కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని రైల్వే స్టేషన్ రోడ్ లో రిపోర్టర్ మధుసూదన్ గౌడ్ సోదరుడు వంశి గౌడ్ స్వామి ఆధ్వర్యంలో గురుస్వామి గిరీష్ నాయర్ సమక్షంలో పడిపూజ అంగరంగ వైభవంగా నిర్వహించారు.హరిహర తనయుడు మణికంఠున్ని పంచామృతాలతో అభిషేకించారు.గణపతి, శివయ్య,అయ్యప్ప స్వామి చిత్రపటాలను తీరొక్కపూలతో అందంగా అలంకరించారు. పలువురు మాల దీక్ష స్వాములు అయ్యప్ప పాటలను ఆలపిస్తూ నృత్యాలు చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాపరెడ్డి,మాజీ జెడ్పిటిసి మామిడి శ్యాంసుందర్ రెడ్డి,మాజీ ఎంపీపీలు శివశంకర్ గౌడ్,పిన్నింటి మధుసూదన్ రెడ్