డిసెంబర్ 31న విస్తృతంగా తనిఖీలు.
జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి.
తెలంగాణ కెరటం ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి డిసెంబర్
మెదక్ జిల్లా వ్యాప్తంగా డిసెంబర్ 31న విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్, వాహన తనిఖీలు నిర్వహించినట్లు జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి సోమవారం తెలిపారు. నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా డిజేలు, అధిక శబ్దం వచ్చే బాక్సులు వినియోగిస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. మైనర్లు వాహనాలతో పట్టుపడితే వారికి వాహనాలు ఇచ్చిన వారిపై కేసును నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.