గజ్వేల్ (ఆర్ ఏ ఎఫ్ ) రాపిడ్ యాక్షన్ ఫోర్స్ తో ఫ్లాగ్ మార్చ్
–శాంతి భద్రతల పరిరక్షణ ధ్యేయంగా ఫ్లాగ్ మార్చ్
తెలంగాణ కెరటం గజ్వేల్ డివిజన్ ప్రతినిధి డిసెంబర్ 21,
భారత హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో విధులు నిర్వహిస్తున్న సీఆర్పీఎఫ్ లో ఒక భాగమైన ఆర్.ఏ.ఎఫ్ (రాపిడ్ యాక్షన్ ఫోర్స్) 1992 సంవత్సరంలో భారత హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఒక విభాగాన్ని స్థాపించింది.దీని యొక్క ముఖ్య ఉద్దేశం దేశంలో ఉన్న ఏ రాష్ట్రంలోనైనా శాంతిభద్రతల సమస్య తలెత్తినప్పుడు,మతఘర్షణలు జరుగుతున్నప్పుడు అదుపు చేయడం ఈ సమస్య యొక్క ముఖ్య ఉద్దేశం.మన తెలంగాణ రాష్ట్రంలో హాకింపెట్,సికింద్రాబాదు నందు 99 బెటాలియన్ కలదు.తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలలో అవగాహన కార్యక్రమంలో భాగంగా జిల్లా భౌగోళిక పరిస్థితులను ఆకళింపు చేసుకోవడానికి జిల్లాకు రావడం జరిగింది.సిద్దిపేట జిల్లా పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం శనివారం నాడు గజ్వేల్ ఇన్స్పెక్టర్ సైదా ఆధ్వర్యంలో గజ్వేల్ పట్టణంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ సైదా మాట్లాడుతూ భౌగోళిక పరిస్థితులు తెలుసుకోవడం గురించి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.జిల్లాలో ఏదైనా శాంతిభద్రతల సమస్య,మతఘర్షణలు జరిగినప్పుడు వెంటనే వచ్చి జిల్లా పోలీసులకు సహాయ సహకారాలు అందించి,బందోబస్తు నిర్వహించి,అదుపు చేయడం గురించి,ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం ప్రజలకు సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ,మేమున్నామనే భరోసా కల్పించడం జరుగుతుందని తెలిపారు.గజ్వేల్ పోలీస్ స్టేషన్ నుండి ఇందిరా పార్క్ చౌరస్తా,కోట మైసమ్మ,పిడిచేడు రోడ్,గవర్నమెంట్ హాస్పిటల్ చౌరస్తా నుండి పోలీస్ స్టేషన్ వరకు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగిందని అన్నారు.ఈ కార్యక్రమంలో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ డిప్యూటీ కమాండెంట్ టిపి బగేల్,ఇన్స్పెక్టర్లు హరిబాబు,మల్లేశ్వరరావు,తొగుట సిఐ లతీఫ్,గజ్వేల్ ఎస్ఐలు యాదవ రెడ్డి,శంకర్,ఆర్ఎఎఫ్ సిబ్బంది,పోలీస్ సిబ్బంది 84 మంది పాల్గొన్నారు.