రక్త దానంతో మరొకరికి ప్రాణదానం -జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలంగాణ కెరటం కామారెడ్డి జిల్లా ప్రతినిధి డిసెంబర్ 21: శనివారం కలెక్టరేట్ లోని జిల్లా వ్యవసాయ శాఖాధికారి కార్యాలయంలో వ్యవసాయ శాఖ ఉద్యోగుల మెగా రక్తదాన శిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రక్తదానం తో మరొకరికి అత్యవసర సమయంలో ప్రాణదానం చేసిన వారమవుతామనీ అన్నారు. ప్రతీ ఒక్కరు ప్రతీ ఆరు మాసాలకు ఒకసారి రక్తం దానం చేయవచ్చని తెలిపారు. బ్లడ్ బ్యాంక్ లో రక్తాన్ని నిలువ చేయడం జరుగుతుందని, అత్యవసర సమయంలో వినియోగించుకోవడం జరుగుతుందని తెలిపారు. మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు, వ్యవసాయశాఖ ఉద్యోగులు రక్తదాన శిబిరంలో పాల్గొంటున్నారని జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్ తెలిపారు. సుమారు 60 యూనిట్ల రక్తం సేకరిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ రాజన్న, టీ.ఎన్.జి. ఒ.అధ్యక్షులు వెంకట్ రెడ్డి, వ్యవసాయ శాఖ, పలుశాఖల ఉద్యోగులు, తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల ప్రతినిధులు,తదితరులు పాల్గొన్నారు.

రక్త దానంతో మరొకరికి ప్రాణదానం

-జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

తెలంగాణ కెరటం కామారెడ్డి జిల్లా ప్రతినిధి డిసెంబర్ 21:

శనివారం కలెక్టరేట్ లోని జిల్లా వ్యవసాయ శాఖాధికారి కార్యాలయంలో వ్యవసాయ శాఖ ఉద్యోగుల మెగా రక్తదాన శిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రక్తదానం తో మరొకరికి అత్యవసర సమయంలో ప్రాణదానం చేసిన వారమవుతామనీ అన్నారు. ప్రతీ ఒక్కరు ప్రతీ ఆరు మాసాలకు ఒకసారి రక్తం దానం చేయవచ్చని తెలిపారు. బ్లడ్ బ్యాంక్ లో రక్తాన్ని నిలువ చేయడం జరుగుతుందని, అత్యవసర సమయంలో వినియోగించుకోవడం జరుగుతుందని తెలిపారు. మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు, వ్యవసాయశాఖ ఉద్యోగులు రక్తదాన శిబిరంలో పాల్గొంటున్నారని జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్ తెలిపారు. సుమారు 60 యూనిట్ల రక్తం సేకరిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ రాజన్న, టీ.ఎన్.జి. ఒ.అధ్యక్షులు వెంకట్ రెడ్డి, వ్యవసాయ శాఖ, పలుశాఖల ఉద్యోగులు, తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల ప్రతినిధులు,తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment