ప్రజా సమస్యల పరిష్కారం కోసం గ్రామ దర్బార్:

ప్రజా సమస్యల పరిష్కారం కోసం గ్రామ దర్బార్:

మెదక్ ఎమ్మెల్యే డాక్టర్. మైనంపల్లి రోహిత్ రావు వెల్లడి.

తెలంగాణ కెరటం ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి డిసెంబర్

ప్రజా సమస్యల పరిష్కారం కోసం మెదక్ ఎమ్మెల్యే డాక్టర్. మైనంపల్లి రోహిత్ రావు కొత్త నిర్ణయం తీసుకున్నారు. సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు గ్రామదర్బార్ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. త్వరలోనే మెదక్ నియోజకవర్గంలో గ్రామ దర్బార్ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. క్యాంప్ ఆఫీస్ కె పరిమితం కాకుండా ప్రజల్లోకి వెళ్లడం జరుగుతుందన్నారు. గ్రామాల్లోకి వెళితే ప్రజలు వారి సమస్యలను తెలుపుతారని ఆయన అన్నారు. సమస్యలు ఉన్న ప్రజలందరి బాధలను తీర్చడం జరుగుతుంది అని ఆయన పేర్కొన్నారు.

Join WhatsApp

Join Now

Latest Stories

*శ్రీ కృష్ణ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా ముగ్గుల పోటీలు* తెలంగాణ కెరటం యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి (జనవరి 15): *యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం వడాయిగూడెం గ్రామంలో శ్రీ కృష్ణ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యూత్ సభ్యులైన కీర్తిశేషులు ముద్దసాని చందు గౌడ్ రాసాల మల్లేష్ యాదవ్ ఏర్పుల ఎల్లస్వామి యాదవ్ వట్టిపల్లి వెంకటేష్ గౌడ్ గార్ల జ్ఞాపకార్ధంగా వీరి పవిత్రమైన ఆత్మ శాంతిని చేకూరాలని మౌనం పాటించి మహిళలకు ముగ్గుల పోటీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో 128 మంది మహిళలు పోటీలో పాల్గొన్నారు ఇందులో 11 ఉత్తమ ముగ్గులకు బహుమతితోపాటు పాల్గొన్న ప్రతి ఒక్క మహిళకు కన్సోలేషన్ బహుమతి అందజేశారు . మొదటి పబ్బాల ఉమారాణి,ద్వితీయ బబ్బురి మమత,తృతీయ బండారి పద్మ, 4వ ఏషబోయిన అక్షర,5వ ముద్దం మానస,6వ శెట్టి మహాలక్ష్మి,7వ కోట స్వాతి,8వ శెట్టి కావ్య,9వ సుక్కల సహస్ర,10వ తోటకూరి హంసాలు,11వ ప్రబ్బాల ప్రసన్న బహమతులు గెలుపొందారు.ఈ సందర్భంగా శ్రీకృష్ణ యూత్ అధ్యక్షులు జిట్ట నరేష్ యాదవ్,గౌరవ అధ్యక్షులు శ్రీ కృష్ణ యాదవ సంఘం భువనగిరి మండల అధ్యక్షులు చుక్కల శంకర్ యాదవ్ మరియు భువనగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ కనకుంట్ల రేఖ బాబురావు మాట్లాడుతూ గ్రామంలో పండగల సందర్భంగా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను గ్రామంలోని మహిళలందరూ పాటిస్తూ ముగ్గుల పోటీలలో చురుకుగా పాల్గొని అద్భుతంగా ముగ్గులు వేసిన మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో చీర్క సురేష్ రెడ్డి,నీల ఓం ప్రకాష్ గౌడ్,నాగ వినోద్,మాణిక్యం రెడ్డి,మంగు నరసింహ,కోట పెద్ద స్వామి,శ్రీ దుర్గాదేవి,బబ్బురి శంకర్ గౌడ్,శెట్టి సుమన్ యాదవ్ ,శెట్టి వంశీ యాదవ్ ,బండారు స్వామి,సుక్కల శ్రీశైలం యాదవ్ ,నోముల నరసింహ యాదవ్,నోముల శ్రీశైలం, శెట్టి శ్రవణ్ యాదవ్ ,గొట్టేటి యాదగిరి, తోటకూరి వెంకటేశ్ యాదవ్ ,మాజీ అధ్యక్షులు రసాల రాజు యాదవ్ ,వల్లాల రాజు ,మాటూరి ఉపేందర్ ,శెట్టి అశోక్ ,శెట్టి శంకర్, గొట్టేటి వెంకటేష్,గొట్టేటి తిరుపతి ,చుక్కల రామకృష్ణ, కలకుంట్ల స్వామి ,శెట్టి మహిపాల్ ,పాక లక్ష్మణ్ ,శ్రీకృష్ణ యూత్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment