ఘనంగా సావిత్రి బాయి పూలే జయంతి వేడుకలు
విద్యార్థులకు పండ్లు పంపిణీ
తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, జనవరి
చదువుల తల్లి సావిత్రి బాయి పూలే జయంతి సందర్భంగా జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నగర్ పాఠశాలలో శుక్రవారం సావిత్రి బాయి పూలే 194 జయంతి వేడుకలను ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం కోరుట్ల డివిజన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సావిత్రి బాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మహిళ ఉపాధ్యాయురాళ్లకు శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ 174 సంవత్సరాల క్రితమే సావిత్రి బాయి పూలే మహిళల అభివృద్ధి కోసం, చైతన్యవంతం చేయడం కోసం పాఠశాలలను ఏర్పాటు చేసి, మహిళలను విద్యావంతురాలను చేశారన్నారు. అప్పుడే ఆమె సొంత ఖర్చులతో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారన్నారు. ఆమె మహిళల కోసం చేసిన సేవలను మరువలేమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘ రాష్ట్ర నాయకులు ఉయ్యాల నరసయ్య, బలిజ రాజారెడ్డి, డివిజన్ అధ్యక్షుడు ఉయ్యాల శోభన్, కోశాధికారి భూపల్లి నగేష్, మాల సంఘం అధ్యక్షుడు పోట్ట లక్ష్మణ్, ఉపాధ్యక్షుడు గురుమంతుల సత్తయ్య, కోశాధికారి సామల వేణుగోపాల్, పసుల కృష్ణ ప్రసాద్, సామల దశరథం, ఎడ్ల ప్రభాకర్, సామల రాజ నరసయ్య, ప్రధానోపాధ్యాయుడు మధుసూదన్ రావు, అఖిల్ అహ్మద్, ముక్క కవిత, రాచర్ల హరిత, చిలువేరి కవిత తదితరులు పాల్గొన్నారు.