ప్రభుత్వ పథకాల అమలును వేగవంతం చేయాలి.

ప్రభుత్వ పథకాల అమలును వేగవంతం చేయాలి.

 

అట్టడుగు వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం.

 

నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్.

 

తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (జనవరి 11):

 

ఇందిరమ్మ ఇండ్ల పథకం , ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల జారీ, రైతు భరోసా పథకాలనుజిల్లాలో పకడ్బందీగా అమలు చేసేందుకు జాబితా ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.శనివారం నాగర్ కర్నూల్ జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా అదనపు కలెక్టర్ దేవ సహాయంతో కలిసి జిల్లా అధికారులతో,నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కలెక్టర్ల కాన్ఫరెన్స్లో చర్చించిన ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల జారీ, రైతు భరోసా జిల్లాలో అమలు చేసే విధివిధానాలపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల పథకం సర్వే జిల్లాలో పూర్తి చేయడం జరిగిందని , అర్హత గల నిజమైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల పథకం పగడ్బందీగా అమలు అమలు చేసే దిశగా చర్యలు చేపట్టాలన్నారు , రైతుల సంక్షేమం, నిరుపేద కుటుంబాల అభివృద్ధి కోసం రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్ల ప్యూరిఫికేషన్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు.రైతు భరోసా పథకంలో అర్హులైన రైతుల వివరాలను క్షేత్రస్థాయిలో సమీక్షించి, లబ్ధిదారుల పేర్లను జాబితాలో చేర్చాలన్నారు.ఇందిరమ్మ ఇండ్ల పథకంలో అర్హులైన నిరుపేదలకు ఇళ్లు కేటాయించే ప్రక్రియను కూడా వేగవంతం చేయాలన్నారు.గ్రామ సభలు నిర్వహించి,తుది జాబితా ఆధారంగా లబ్ధిదారులను ఖరారు చేయాలన్నారు. ప్రతి మండలాన్ని రెండు భాగాలుగా విభజించి, ప్రతి భాగానికి డిప్యూటీ తహసీల్దార్‌ను బాధ్యత వహించేలానియమించాలని సూచించారు. డిప్యూటీ తహసీల్దార్ తో పాటు సీనియర్ అసిస్టెంట్ లేదా జూనియర్ అసిస్టెంట్, ఒక కంప్యూటర్ ఆపరేటర్‌ను కూడా ఉంచుకుని డేటాను సక్రమంగా సమీక్షించి, అర్హులైన వారి జాబితాను ను సిద్ధం చేయాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ పిడి చిన్న ఓబులేసు జిల్లా వ్యవసాయ అధికారి చంద్రశేఖర్, డిపిఓ రామ్మోహన్రావు, జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈవో గోపాల్, కలెక్టరేట్ ఏవో చంద్రశేఖర్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment