జనవరి 12,13,14 సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగే ఆశీర్వద సువార్త స్వస్థత సభల పోస్టర్స్ ఆవిష్కరణ 

జనవరి 12,13,14 సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగే ఆశీర్వద సువార్త స్వస్థత సభల పోస్టర్స్ ఆవిష్కరణ 

తెలంగాణ కెరటం సూర్యాపేట జిల్లా ప్రతినిధి డిసెంబర్ 21 .

సూర్యాపేట పట్టణ కేంద్రం లోని రెవ. డా. ధరవత్ లాకు నాయక్ రేణుక రీచ్ ఇండియా చర్చ్ నందు సూర్యాపేట జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మరియు బేతెస్థ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు బిషప్ దుర్గం ప్రభాకర్ హెప్సిబా లు కన్వీనర్లు గా 2025 జనవరి నెలలో తేది 12,13,14 ఆది, సోమ, మంగళవారం లలో సహోదరులు హ్యారీ గోమ్స్ ప్రసంగికులుగా హ్యారీ గోమ్స్ మినిస్ట్రీస్ వారి ఆశీర్వద సువార్త స్వస్థత సభలు సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ కాలేజ్ గ్రౌండ్ నందు జరిగే సభల పోస్టర్స్ ను సూర్యాపేట జిల్లా పాస్టర్స్ పెలోషిఫ్ గౌరవ అధ్యక్షులు, మన్నా చర్చ్ సీనియర్ దైవజనులు బిషప్ సాల్మన్ రాజు, గౌరవ సలహాదారులు రెవ. డా. పి. జాన్ మార్క్, రెవ. మిట్టగడుపుల హాజర్య, సూర్యాపేట పట్టణ పాస్టర్స్ పెలోషిఫ్ అధ్యక్షులు అధ్యక్షులు రెవ. ఇంజమూరి గాబ్రియేల్, నియోజకవర్గం అధ్యక్షులు రెవ. డా. జలగం జేమ్స్ లు ప్రార్ధించి విజయవంతం చేయాలనీ పిలుపునిస్తూ పోస్టర్స్ ను ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమం లో రెవ. డా. రెమడాల రూబెన్,పాస్టర్ జి. బాబు రావు, పాస్టర్ రాజా బాబు, రెవ. డా. పంది మార్క్,చివ్వేంల అధ్యక్షులు రెవ. గుగులోత్ బాలాజీ నాయక్, సూర్యాపేట రూరల్ అధ్యక్షులు పాస్టర్ యల్క ప్రభాకర్, వర్కింగ్ ప్రెసిడెంట్ రెవ. ఏర్పుల క్రిస్టోఫర్,బానోత్ సుధాకర్,దానియేలు నాయక్, సైదా నాయక్ తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment