ప్రభుత్వ పథకాల అమలుకు జనవరి 26 టార్గెట్ ఫిక్స్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ .
–అట్టడుగు వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం.
తెలంగాణ కెరటం ఉమ్మడి మెదక్ జిల్లా ప్రధాన ప్రతినిధి జనవరి 11:
ఇందిరమ్మ ఇండ్ల పథకం , ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల జారీ, రైతు భరోసాజిల్లాలో పకడ్బందీగా అమలు చేసేందుకు జాబితా ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్ అధికారులను ఆదేశించారు.శనివారం సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కలెక్టర్ల కాన్ఫరెన్స్లో చర్చించిన ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల జారీ, రైతు భరోసా జిల్లాలో అమలు చేసే విధివిధానాలపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల పథకం సర్వే జిల్లాలో 96 శాతం కంప్లీట్ చేయడం జరిగిందని అర్హత గల నిజమైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల పథకం పగడ్బందీగా అమలు అమలు చేసే దిశగా చర్యలు చేపట్టాలన్నారు ,రైతుల సంక్షేమం, నిరుపేద కుటుంబాల అభివృద్ధి కోసం రైతు భరోసా,ఇందిరమ్మ ఆత్మీయ భరోసా,ఇందిరమ్మ ఇండ్ల ప్యూరిఫికేషన్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు.రైతు భరోసా పథకంలో అర్హులైన రైతుల వివరాలను క్షేత్రస్థాయిలో సమీక్షించి, లబ్ధిదారుల పేర్లను జాబితాలో చేర్చాలన్నారు.ఇందిరమ్మ ఇండ్ల పథకంలో అర్హులైన నిరుపేదలకు ఇళ్లు కేటాయించే ప్రక్రియను కూడా వేగవంతం చేయాలన్నారు.ప్యూరిఫికేషన్ ప్రక్రియ 16వ తేదీ నుంచి ప్రారంభించి 20వ తేదీ నాటికి పూర్తిచేయాలన్నారు.16వ నుండి 18వ తేదీ వరకు ఫీల్డ్ పనులు పూర్తి చేసి,19వ తేదీ నాటికి కార్యాలయంలో సమీక్ష జరిపి, తుది జాబితాను 20వ తేదీకి సమర్పించాలన్నారు.21వ నుంచి 24వ తేదీ వరకు గ్రామ సభలు నిర్వహించి,తుది జాబితా ఆధారంగా లబ్ధిదారులను ఖరారు చేయాలన్నారు. ప్రతి మండలాన్ని రెండు భాగాలుగా విభజించి, ప్రతి భాగానికి డిప్యూటీ తహసీల్దార్ను బాధ్యతవహించేలానియమించాలని సూచించారు. డిప్యూటీ తహసీల్దార్ తో పాటు సీనియర్ అసిస్టెంట్ లేదా జూనియర్ అసిస్టెంట్, ఒక కంప్యూటర్ ఆపరేటర్ను కూడా ఉంచుకుని డేటాను సక్రమంగా సమీక్షించి, సరైన పద్ధతిలో సర్వేను పూర్తి చేయాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఆర్డీవోలు జయచంద్ర రెడ్డి ,రమాదేవి, మైపాల్ రెడ్డి, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, డిఆర్డిఓ శ్రీనివాస్, డిపిఓ యాదయ్య, డిఎస్ఓ సురేష్, అగ్రికల్చర్ అధికారి వినయ్,హౌసింగ్ పిడి మాణిక్యం హౌసింగ్ డి ఈ లు,ఈ ఈ లు , ఎంపీడీవోలు,వ్యవసాయ శాఖ ఏడీలు,ఏవోలు తదితరులు పాల్గొన్నారు.