ఎందరో రక్తదాతలకు ఆదర్శప్రాయుడు కటుకం గణేష్ 

ఎందరో రక్తదాతలకు ఆదర్శప్రాయుడు కటుకం గణేష్ 

కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ 

తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, జనవరి 11 : ఎందరో రక్తదాతలకు ఆదర్శప్రాయుడు కటుకం గణేష్ అని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన సామాజికవేత్త, రక్తదాన సంధానకర్త, ప్రాణదాత కటుకం గణేష్ ఏపీజే అబ్దుల్ కలాం అవార్డు పొందిన సందర్భంగా కోరుట్ల పట్టణంలోని సరస్వతి శిశుమందిర్ ఆధ్వర్యంలో శనివారం జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా అవార్డు గ్రహీత, ప్రాణదాత కటుకం గణేష్ ను కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలుమాట్లాడుతూ కోరుట్ల ప్రాంతంలో 2007 సంవత్సరంలో రక్తదాన ఉద్యమం ప్రారంభించి, నేటికి 17 సంవత్సరాలలో 4,250 మంది రక్తదాతలతో రక్తాన్ని ఇప్పించిన కటుకం గణేష్ అభినందనీయుడని కొనియాడారు. ఒకప్పుడు రక్తం దొరకక నఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయని, ఇప్పుడు గత 17 సంవత్సరాల నుండి సామాజికవేత్త, రక్తదాన సంధానకర్త, ప్రాణదాత కటుకం గణేష్ రక్తదాన ఉద్యమాన్ని ప్రారంభించిన నుండి కోరుట్ల ప్రాంతంలోనే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలలో రక్తదానానికి కొదవ లేకుండా చేసిన కటుకం గణేష్ ధన్యజీవని అన్నారు. కటుకం గణేష్ మున్ముందు ఇలాంటి మరెన్నో కార్యక్రమాలను చేపట్టి ఇంకా మెరుగైన సేవలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది బొడ్ల శ్రీనివాస్, హరిస్మరణ్ రెడ్డి, డాక్టర్ వేముల రవి కిరణ్, నీలి శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయులు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment