భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల ఎమ్మెల్సీ శేరీ సుభాష్ రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్టం చేశారు.

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల ఎమ్మెల్సీ శేరీ సుభాష్ రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్టం చేశారు.

తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ సంతాపం ప్రకటించారు.

తెలంగాణ కెరటం ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి డిసెంబర్ 27:

దేశం ఆర్థికంగా క్లిష్ట సమయంలో వున్నప్పుడు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తెచ్చిన ఆర్థిక సంస్కరణలను అమలు చేయడంలో ఆర్థికరంగ నిపుణుడుగా తన విద్వత్తును ప్రదర్శించారని కొనియాడారు.
పీవీ మనసు గెలిచిన మన్మోహన్ సింగ్ ఆనేక ఉన్నత శిఖరాలకు చేరుకున్న భరతమాత ముద్దుబిడ్డగాకొనియాడారు.భారత ప్రధానిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ హయాంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగడం చారిత్రక సందర్భం అని ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి అన్నారు. మిత భాషిగా,అత్యంతసౌమ్యుడుగా,జ్ఞానాన్ని సొంతం చేసుకున్న స్థిత ప్రజ్ఞత కలిగిన నేతగా,భారత ప్రధానిగా మన్మోహన్ సింగ్ దేశానికి అందించిన సేవలు గొప్పవి అన్నారు.తెలంగాణ ఉద్యమాన్ని,ప్రజల మనోభావాలను అర్ధం చేసుకుని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంపూర్ణ మద్దతు ప్రకటించారని గుర్తుచేసుకున్నారు.ప్రధానిగా తెలంగాణ ఏర్పాటు సందర్భంగా వారందించిన మద్దతును,చేసిన కృషిని తెలంగాణ సమాజం సదా గుర్తుంచుకుంటుందని ఎమ్మెల్సీ అన్నారు.మన్మోహన్ సింగ్ మరణం భారత దేశానికి తీరని లోటని సుభాష్ రెడ్డి అన్నారు.శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్సీ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment