మెదక్ ఎంపీ ని కలిసిన గజ్వేల్ నియోజకవర్గ మండలాల అధ్యక్షులు
-స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి గెలుపే లక్ష్యంగా పనిచేయాలి
-మెదక్ ఎంపీ రఘునందన్ రావు
తెలంగాణ కెరటం గజ్వేల్ డివిజన్ ప్రతినిధి జనవరి
సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ పట్టణ మండలాల బిజెపి నూతన అధ్యక్షులను ఇటీవలే రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ప్రకటించడం జరిగింది.ఈ సందర్భంగా బిజెపి నూతన అధ్యక్షులు మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావును హైదరాబాద్ లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలసి పుష్పగుచ్చంను అందజేశారు.అనంతరం నూతన అధ్యక్షులను మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు శాలువాతో సత్కరించారు.రఘునందన్ రావు మాట్లాడుతూ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి గెలుపే లక్ష్యంగా పనిచేయాలని భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ముందుకు సాగాలని నూతన అధ్యక్షులకు దిశా నిర్దేశం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో గజ్వేల్ పట్టణ బిజెపి అధ్యక్షులు దేవులపల్లి మనోహర్ యాదవ్,గజ్వేల్ మండల బిజెపి అధ్యక్షులు పంజాల అశోక్ గౌడ్,కూకునూర్ పల్లి మండల బిజెపి అధ్యక్షులు అనుముల సంపత్ రెడ్డి,కోండపాక మండల బిజెపి అధ్యక్షులు నీల సత్యం ముదిరాజ్,తూఫ్రాన్ పట్టణ బిజెపి అధ్యక్షులు జానకిరామ్ గౌడ్,మనోహరాబాద్ మండల బిజెపి అధ్యక్షులు బక్క వెంకటేష్ తదితరులు ఉన్నారు.