నిషేధిత డ్రగ్స్ అక్రమంగా రవాణా చేస్తున్న వారి పట్టివేత..
తెలంగాణ కెరటం కామారెడ్డి క్రైమ్ రిపోర్ట్ మార్చ్ 08
అక్రమంగా 250 గ్రాముల నిషేధిత డ్రగ్స్(అల్ట్రాజోలం)ను తీసుకెళ్తున్న వ్యక్తులను శనివారం ఎక్సైజ్ ఎన్ ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అల్ట్రాజోలం తరలిస్తున్నట్లుగా సమాచారం రావడంతో ఎక్సైజ్ పోలీసులు దాడి చేసి.. కామారెడ్డికి చెందిన మధుసూదన్ చారి, తాండూరు మండలం అక్కపల్లి గ్రామానికి చెందిన భూమా విఠల్ గౌడ్, గుండారం వెంకగౌడ్ను అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. వీరు ముగ్గురు సదాశివనగర్ మండలం భూంపల్లి గ్రామానికి చెందిన సురేశ్ గౌడ్ వద్ద అల్ట్రాజోలం కొనుగోలు చేశారనీ, ప్రస్తుతం సురేశ్ గౌడ్ పరారీలో ఉన్నాడు. ముగ్గురితో పాటు విక్రయదారుడు సురేశ్ గౌడ్పై కేసు నమోదు చేశామని, ఓ బైక్ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐ స్వప్న, ఎస్సైలు రాంకుమార్, విక్రమ్ కుమార్, సిబ్బంది హమీద్, విష్ణు, అవినాష్, శ్యామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.