పేకాట స్థావరం పై సిద్దిపేట టాస్క్ ఫోర్స్,గజ్వేల్ పోలీసుల దాడి
తెలంగాణ కెరటం గజ్వేల్ డివిజన్ ప్రతినిధి జనవరి 17,
గజ్వేల్ పట్టణంలోని ఎరుకల కాలనీలో కొంతమంది వ్యక్తులు కలసి పేకాట ఆడుతున్నారని నమ్మదగిన సమాచారంపై సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు,గజ్వేల్ పోలీసులు వెళ్లి రైడ్ చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.ఇద్దరు వ్యక్తులు పారిపోయారు.వారిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 15,000 వేల రూపాయలు,03 మొబైల్ ఫోన్లు, స్వాధీనం చేసుకున్నారు.గజ్వేల్ పోలీసులు కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించారు.పేకాట ఆడిన వారి వివరాలు 1.వనం వెంకటేష్,2.కండేలా సాయిలు,3.వనం పాపయ్య,నివాసం ఎరుకల కాలనీ గజ్వేల్ పట్టణం.పారిపోయిన వారి వివరాలు 4.పోలా మల్లేష్,5.పేరు తెలియని వ్యక్తి ఒకరు ఉన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టాస్క్ ఫోర్స్ అధికారులు,గజ్వేల్ పోలీసులు మాట్లాడుతూ గ్రామాలలో,పట్టణాలలో ఫామ్ హౌస్ లలో,ఇళ్ళల్లో పేకాట,బహిరంగ ప్రదేశంలో జూదం మరే ఇతర చట్టవ్యతిరేకమైన కార్యక్రమాలు ఎవరైనా నిర్వహిస్తున్నట్లు తెలిస్తే,లేదా ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నటు సమాచారం ఉంటే వెంటనే సిద్దిపేట టాస్క్ ఫోర్స్ అధికారుల నెంబర్లు 8712667445,8712667446,8712667447 లకు సమాచారం అందించాలని సూచించారు.సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు.