30 లక్షల విలువగల 2 కార్లు,16 బైక్స్ సీజ్ చేసిన సూర్యాపేట 2 వ పట్టణ పోలీసులు, ముగ్గురు నింధితుల అరెస్ట్

30 లక్షల విలువగల 2 కార్లు,16 బైక్స్ సీజ్ చేసిన సూర్యాపేట 2 వ పట్టణ పోలీసులు, ముగ్గురు నింధితుల అరెస్ట్

 

తెలంగాణ కెరటం ; సూర్యాపేట జిల్లా ప్రతినిధి డిసెంబర్ 19.

 

సూర్యాపేట జిల్లా పోలీసు కార్యలయం నందు నిర్వహించిన ప్రెస్ మీట్ నందు అధనపు ఎస్పీ నాగేశ్వరావు, పట్టణ ఇన్స్పెక్టర్ వీర రాఘవులు తో కలిసి కేసుల వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ నిందితులైన కొరపాటి నర్సింగరావు, బాత ప్రాసాద్ లు ఇద్దరు కలిసి కార్లు అద్దెకు తీసుకుని మార్గం మద్యలో డ్రైవర్ తో కలిసి మద్యం తాగి డ్రైవర్ మత్తులోకి వెళ్ళగానే కార్లు దొంగతనం, లిస్ట్ అడిగి డ్రైవర్ మార్గం మద్యలో అవసరాలకోసం కారు, బైక్స్ ఆపితే ఆధును చూసి వాహనాలు ఎత్తుకెళ్లడం చేస్తుంటారని, ఇలా 2 కార్లు, 4 బైక్స్ దొంగతనం చేశారని సూర్యాపేట జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ చెప్పారు. గురువారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.

నవంబర్ 16 వ తేదీన సూర్యాపేట పట్టణం బాలాజీనగర్ కు చెందిన మర్రు వెంకటేశ్వరరావు తన మారుతి ఎర్టిగా కారులో అక్టోబర్ 27న విజవాడలో చదువుతున్న తన కుమార్తె వద్దకు తన వెళుతుండగా సూర్యాపేట కొత్త బస్టాండ్‌కు చేరుకోగా ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు లిఫ్ట్‌ అడగడంతో వారికి లిఫ్ట్ ఇచ్చానని, వారు నాతో మాటలు కలిపి పోన్ నబర్స్ కూడా మార్పు చేసుకున్నామని, సాయంత్రం విజయవాడ చేరుకున్నామని, తన కుమార్తె కోసం ఏవైనా తినడానికి కొనడానికి స్టార్టింగ్ స్థితిలో తన కారును పార్క్ చేశాడని, తినుబండారాలను కొనుగోలు చేసిన తర్వాత అతను తన కారు వద్దకు తిరిగి వచ్చే సరికి కారు కనిపించకపోవడంతో వెంటనే తన కారు కోసం చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా కనిపించలేదని, లిఫ్ట్ అడిగిన వారికి ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ చేయబడిందనీ, అనారోగ్యంతో ఉండడం వల్ల వెంటనే పోలీస్ స్టేషన్‌కు రాలేకపోయానని, ఈ విషయంలో చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరుతూ సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడం జరిగిందని ఎస్పీ చెప్పారు. పిర్యాదుపై సూర్యాపేట రెండవ పట్టణ పి.ఎస్. నందు సీ ఆర్.517/2024 యు/యస్ 318(4), 303(2) బిఎన్ఎస్ లో కేసు నమోదు చేసి, సూర్యాపేటటౌన్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కేసు దర్యాప్తు చేస్తున్నారని, డిసెంబర్ 18 తేదీన వాహనాలు తనికి చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు అనుమానంగా తిరుగుతుండగా ఆధుపులోకి తీసుకుని విచారించగా వారు వాహనాలు దొంగతనానికి పాల్పడుతున్నామని ఒప్పుకున్నారనీ, కార్లు అద్దెకు తీసుకుని మార్గం మద్యలో డ్రైవర్ తో కలిసి మద్యం తాగి డ్రైవర్ మత్తులోకి వెళ్ళగానే కార్లు దొంగతనం చేస్తునట్లు ఒప్పుకున్నారనీ, అలాగే పార్క్ చేసిన బైక్ లను సైతం నకిలి తాళం తో తీయడం, తాళం పగలగొట్టి బైక్ దొంగతనాలు చేస్తున్నామని ఒప్పుకున్నారనీ ఎస్పీ వెల్లడించారు. నిందితుల నుండి ఒక ఎర్టీగా (టీఎస్ 29 జి 9459) కారు, ఒక ఇన్నోవా (ఏపీ05 టీజీ 2377) కారు, స్ప్లెండర్, యూనికార్న్, పల్సర్, యాక్టివా మొత్తం నాలుగు బైక్స్ స్వాదినం చేసుకుని నింధితులను రిమాండ్ కు తరలించామని చెప్పారు. నింధితుడు ప్రసాద్ పై గతంలో విశాఖపట్నంలో రెండు కేసులు ఉన్నాయన్నారు.

ఒక దొంగ నుండి 12 బైక్స్ స్వాదినం చేసుకున్నా సూర్యాపేట 2వ పట్టణ పోలీసులు, దొంగ అరెస్ట్, రిమాండ్.

 

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ కు చెందిన నిందితుడు గుంజ శ్రీకాంత్ కాలేజీలు, హాస్పటల్స్ వద్ద పార్క్ చేసిన వాహనాలను నకిలీ తాళంతో తీసి దొంగతనాలు చేస్తునట్లు పోలీసుల విచారణ తేలిందని ఎస్పీ చెప్పారు.

ఆత్మకూరు మండలానికి చెందిన విద్యార్ధి గుణగంటి మహేష్ వెంకన్న డిసెంబర్ 7న సూర్యాపేట పట్టణం లో గల స్పందన డిగ్రీ కాలేజీలో పరీక్ష రాయడానికి వచ్చి తన ప్యాషన్ ప్లస్ బైక్ ను కళాశాల ముందు పార్క్ చేసి పరీక్ష పూర్తయిన తర్వాత తన బైక్‌ వద్దకు వచ్చి చూడగా బైక్‌ కనిపించడం లేదని, తన బైక్ గురించి పరిసర ప్రాంతాల్లో వెతకగా దొరకలేదని, డిసెంబర్ 16న సూర్యాపేట పట్టణ 2వ పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేశాడని చెప్పారు. తన బైక్ చోరీకి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని ఫిర్యాదుదారుడు కోరాడని, దీనిపైసూర్యాపేట రెండవ పట్టణ పి.ఎస్. సీ ఆర్.557/2024 యు/యస్ 303(2) బి.ఎన్.ఎస్ లో కేసు నమోదు చేసి, సూర్యాపేట 2టౌన్ పోలీస్ కేసును దర్యాప్తు చేసారని, దర్యాప్తు లో భాగంగా డిసెంబర్ 18న సూర్యాపేటటౌన్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్, సిబ్బంది కొత్త బస్టాండ్ వద్ద వాహనాలు తనికి చేస్తుండగా ఒక వ్యక్తిని అనుమానాస్పద పరిస్థితుల్లో పట్టుకున్నారని, విచారించగా అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేయగా కాలేజీలు, హాస్పటల్స్ వద్ద పార్క్ చేసిన వాహనాలను నకిలీ తాళంతో తీసి దొంగతనాలు చేస్తునట్లు ఒప్పుకున్నాడని, ఇతనిని వద్ద నుండి 12 కేసుల్లో 12 బైక్స్ స్వాదినం చేసుకుని నిందితున్ని రిమాండ్ కు తరలించమని ఎస్పీ వెల్లడించారు.

ఈ కేసుల పర్యవేక్షణ పని చేసిన డిఎస్పి రవి, చేదనలో బాగా పనిచేసిన సూర్యాపేట పట్టణ ఇన్స్పెక్టర్ వీర రాఘవులు, ఎస్సైలు ఆంజనేయులు, ఏడుకొండలు, కుశలవ, సైదులు, టెక్నికల్ సిబ్బంది కర్ణాకర్, కృష్ణ, శివ, సుధాకర్, రవి, మధు లను ఎస్పి అభినందించి రివార్డ్ లు అందించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment