సర్వ శిక్ష అభియాన్ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి
తెలంగాణ కెరటం ఆర్మూరు ప్రతినిధి, జనవరి
తెలంగాణ రాష్ట్రంలో సర్వ శిక్ష అభియాన్ లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రెగ్యులరైజ్ చేయాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి, తెలంగాణ బీసీ గ్రాడ్యుయేట్స్ ఫోరం చైర్మన్ అబ్బగోని అశోక్ గౌడ్ డిమాండ్ చేశారు.
వారు చేపట్టిన దీక్ష న్యాయబద్ధమైన దని వారికి అండగా తెలంగాణ బీసీ గ్రాడ్యుయేట్ ఫోరం ఉంటుందని పట్టభద్రుల ఎమ్మెల్సీ అశోక్ గౌడ్ తెలియజేశారు. వారిని రెగ్యులర్ చేస్తూ స్కేల్ ఇవ్వాలని డీఎస్సీ మెరిట్ లిస్టు ఆధారంగా రోస్టర్ పాయింట్ ప్రకారం నియమించడం జరిగింది కాబట్టి వారిని రెగ్యులర్ చేయడం న్యాయమైన డిమాండ్ అని పట్టభద్రుల ఎమ్మెల్సీ అబ్బగొని అశోక్ గౌడ్ తెలియజేశారు. అదేవిధంగా సర్వ శిక్ష అభియాన్ లో భాగంగా కేజీవిపి వారిని కూడా రోస్టర్ ప్రకారం నియమించడం జరిగింది కాబట్టి వారిని కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. సి ఆర్ పి, ఎం ఐ ఎస్ కోఆర్డినేటర్, టిఆర్టి, ఏ ఆర్ కె, కంప్యూటర్ ఆపరేటర్, క్లర్క్, అకౌంటెంట్, అటెండర్, వాచ్మెన్ తదితరులను టీచింగ్ మరియు నాన్ టీచింగ్ వృత్తి విద్య కోర్సులను పరిగణలోకి తీసుకొని రెగ్యులర్ చేయాలని తెలంగాణ బీసీ గ్రాడ్యుయేట్స్ ఫోరమ్ చైర్మన్ మరియు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అబ్బగోని అశోక్ గౌడ్ డిమాండ్ చేశారు.