నూతన 108 అంబులెన్స్ ప్రారంభించిన ఖెడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి
నారాయణఖేడ్ నియోజకవర్గం
తెలంగాణ కెరటం:సిర్గాపూర్ నారాయణఖేడ్ నియోజకవర్గం ప్రతినిధి జనవరి
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం సిర్గాపూర్ మండల మరియు కేంద్ర పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో ఈరోజు నూతన 108 అంబులెన్స్ ప్రారంభించిన నారాయణఖెడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి
అనంతరం ఎమ్మెల్యే గారు ఆసుపత్రి ఆవరణలో మొత్తం చుట్టూ తిరిగి మరియు రోగుల రూమ్ లోకి వెళ్లి వారి ఆరోగ్యం క్షేమాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మా కాంగ్రెస్ ప్రభుత్వం వైద్యం పట్ల ఎంతో శ్రద్ధతో ప్రతి ఒక్క పేదవాడికి మంచి వైద్యం అందించాలని ఒక గొప్ప సంకల్పంతో మా ప్రభుత్వం ముందుకెళుతుందని అన్నారు అనంతరం ఎమ్మెల్యే గారు ఆసుపత్రి వైద్యులకు మరియు సిబ్బందులకు గ్రామాల నుండి అమాయకమైన ప్రజలు ఆసుపత్రికి వస్తా ఉంటారు కావున వారిని మీరు వాడిని ప్రేమతో పలకరించి వారికి సరైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే గారు వారికి సూచించడం జరిగింది
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారితో పాటు యాదవ రెడ్డి మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ పిరప్ప, మహేశ్వర్ సెట్,సల్మాన్, జ్ఞానేశ్వర్, విఠల్ రావు, శభాష్, సాయిలు, లక్ష్మయ్య, అనంత్ రెడ్డి,శుభాష్,జైరాజ్,తదితర ముఖ్యనాయకులు మరియు ఆసుపత్రి వైద్యులు మరియు వైద్య సిబ్బందులు మరియు 108 సిబ్బందులు తదితరులు పాల్గొన్నారు