ఒకే నెలలో మూడు గంజాయి కేసులు.
తెలంగాణ కెరటం ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి డిసెంబర్
మెదక్ జిల్లా చిన్న శంకరంపేట లో గంజాయి విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఈనెల 28న బీహార్ కు చెందిన రాజేష్ వద్ద 190 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. కాగా ఈనెల చిన్న శంకరం పేట పరిశ్రమ వద్ద బీహార్ కు చెందిన సూరత్ అనే వ్యక్తి నుంచి ఇద్దరు వ్యక్తులు గంజాయి కొనుగోలు చేయగా జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారులకు పట్టుబడ్డారు. రామాయంపేట సర్కిల్ పరిధిలో మండలాల్లో గంజాయి సరఫరా జోరుగా జరుగుతున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు.