స్వచ్ఛందంగా వ్యాపార సంస్థలు బంద్.
మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో బైపాస్ రోడ్డు విషయంలో వ్యాపారస్తులు బంధు నిర్వహించారు.
తెలంగాణ కెరటం ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి జనవరి
మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో మంగళవారం వర్తక,వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా బంద్ నిర్వహించడం జరిగింది. ప్రభుత్వం మెదక్ నుండి ఎల్కతుర్తి జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా రామాయంపేట పరిధిలో బైపాస్ రోడ్డు నిర్మాణం చేయడంతో వ్యాపారస్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బైపాస్ రోడ్డు నిర్మాణం వల్ల వ్యాపారాలు పూర్తిగా దెబ్బతింటున్నాయని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బైపాస్ రోడ్డు నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలని వ్యాపారస్తులు డిమాండ్ చేస్తున్నారు.