అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇల్లు అందిస్తాం*

*అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇల్లు అందిస్తాం*

 

* తమకు ఇల్లు రాలేదని ఎవరు ఆందోళన చెందవద్దు*

* ఇందిరమ్మ ఇల్లు కోసం ఎవరికి నయా పైసా ఇయ్యవద్దు*

* డబ్బులు అడిగితే సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గం ఇంచార్జ్ పూజల హరికృష్ణకు ఫిర్యాదు చేయండి*

* 9వ 29 వార్డుల లో సర్వే ప్రారంభించిన ఇంద్రమ్మ కమిటీ

* మంచి పథకాన్ని ప్రజలకు అందిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి కృతజ్ఞతలు

 

* సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్

తెలంగాణ కెరటం సిద్దిపేట జిల్లా క్రైమ్ ప్రతినిధి

 

సిద్ధిపేటలో

పట్టణంలో అర్హులైన ప్రజలందరికీ ఇందిరమ్మ ఇల్లు పథకం వర్తింప చేసేలా చొరవ తీసుకుంటామని సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ తెలిపారు. సిద్ధిపేటలోని 9వ వార్డులో ఇందిరమ్మ ఇళ్ళ కోసం సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ ఆధ్వర్యంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు సర్వేను ప్రారంభించారు. ఈ సందర్భంగా సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేద ప్రజలకు గూడు కల్పించాలన్న ఆలోచనతో ఇందిరమ్మ ఇల్లు పథకం తీసుకొచ్చారనీ అని అన్నారు. ప్రజలకు ఇంత మంచి పథకాన్ని అందిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సర్వే అంతట జరుగుతుందని అర్హులైన వారు ఎవరు కూడా ఆందోళన చెందవద్దని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు అందజేస్తామని అన్నారు. బిఆర్ఎస్ నాయకులు పుకార్లు నమ్మవద్దని కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన మేరకు అర్హులైన అందరినీ గుర్తిస్తామని అన్నారు. తమకు ఇందిరమ్మ ఇల్లు రాదేమో అని అపోహ కూడా పెట్టుకోవద్దని అన్నారు. ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని ఎవరైనా మీ దగ్గరికి వచ్చి డబ్బులు అడిగితే ఇవ్వవద్దని అన్నారు. ఎవరైనా వచ్చి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని డబ్బులు డిమాండ్ చేస్తే సిద్ధిపేటలోని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కార్యాలయ దృష్టికి తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు గాజుద్దీన్ 29 వార్డ్ ఇంచార్జ్ రాషాద్. నాజ్జు బబులు. ఫాయాజ్. తదితరాలు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment