ఏసీబీ వలలో చిక్కిన లింగంపేట ఎస్ఐ సుధాకర్
–12,500 లంచం తీసుకుంటూ నిజామాబాద్ లో పట్టుబడిన ఎస్సై
తెలంగాణ కెరటం కామారెడ్డి జిల్లా ప్రతినిధి జనవరి 29:
లంచం తీసుకుంటూ లింగంపేట ఎస్సై సుధాకర్ నిజామాబాద్ లో ఏసీబీ పోలీసులకు పట్టుబడ్డారు. అమ్మకాలు కొనుగోలు చేసే వ్యాపారి నుంచి వాహనానికి 12,500 చొప్పున లంచం అడిగిన ఎస్సై నిజాంబాద్ లోని రుక్మిణి చాంబర్ (హనుమాన్ జంక్షన్) ప్రాంతంలో బుధవారం లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండ్ గా ఏసీబీ పోలీసులకు చిక్కాడు. సుధాకర్ కు ముందు గతంలో పనిచేసిన ఎస్సై స్టేషన్ బెయిల్ కోసం లంచం తీసుకుంటూ ముందే పట్టుబడ్డాడు.