నిర్మలమ్మ బడ్జెట్పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ అసంతృప్తి వ్యక్తం చేశారు
తెలంగాణ కెరటం స్టేట్ బ్యూరో ఫిబ్రవరి 2:
దేశంలో మైనార్టీలు దళితులు మహిళలు తమ భద్రతపై ఆందోళన చెందుతున్నారని, కానీ బడ్జెట్లో మహిళల భద్రత ఊసెత్తలేదని అన్నారు.ఆంధ్ర, బీహార్ కు ప్రకటించిన దాంట్లో తెలంగాణకు 25 శాతం కూడా ప్రకటించలేదు. వారికి ఎందుకిచ్చారు అని మేము అడగటం లేదు మాకు కూడా న్యాయం చేసి సమానంగా నిధులు ప్రకటించి వుంటే బాగుండేది.ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణను మరోసారి విస్మరించారని మండిపడ్డారు. రాష్ట్రానికి ఇండియన్ ఐఐఎం, ట్రిపుల్ ఐటీ సంస్థలను కేటయించాలని ఎప్పటినుంచో అడుగుతున్నాఈ బడ్జెట్లో కూడా కేటాయించలేదన్నారు.జిల్లాకో నవోదయ విద్యాలయం కేటయించాలన్న మా వినతిని పెడచెవినపెట్టారని ఆరోపించారు.అన్ని రాష్ట్రాల్లో సైనిక్ స్కూల్స్ ఉన్నాయి.. తెలంగాణ ఈ బడ్జెట్లో కూడా సైనిక్ స్కూల్కు నోచుకోలేదన్నారు.తెలంగాణలో బీజేపీ నుంచి 8 మంది, కాంగ్రెస్ నుంచి 8 మంది ఎంపీలున్నా రాష్ట్రానికి దక్కిందేమీ లేదన్నారు.బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు లోక్సభలో కేంద్రాన్ని నిలదీయాలి.రాజ్యసభలో మా సభ్యులు తెలంగాణకు దక్కాల్సిన ప్రయోజనాలపై కేంద్రంపై పోరాడుతున్నారు.త్వరలో ఎన్నికలు జరిగే బీహార్ రాష్ట్రానికి వరాలు ప్రకటించారని ఆరోపించారు. ఎన్నికలుంటేనే రాష్ట్రాలను పట్టించుకుంటామన్న వైఖరి సరికాదని, మోడీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటారు.కానీ అన్ని రాష్ట్రాలను ఒకేలా చూడడం లేదని ఆరోపించారు. మధ్యతరగతి ప్రజలకు ఇన్కమ్ టాక్స్లో ఊరటనివ్వడాన్ని ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు. వ్యవసాయానికి గతంతో పోలిస్తే కొంత తోడ్పాటు లభించిందని, అయినా ఇది సరిపోదన్నారు.పదేళ్లుగా మోడీ పేద, మధ్యతరగతి ప్రజలను నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. దేశంలో నిరుద్యోగం, కొంతమంది దగ్గరే సంపద కేంద్రీకృతమైన ధోరణి పెరుగుతోందని వెల్లడించారు.బడ్జెట్ మొత్తంలో తెలంగాణ ప్రస్తావన లేకపోవడం బాధాకరమన్నారు.రూ. 50 లక్షల 65వేల కోట్లతో బడ్జెట్ పెట్టినప్పటికీ కేవలం వాళ్లు అధి